దళితులు నీకు బానిసలుగా బతకరు: వీరమహిళ రియ

పాలకొల్లు, ఈ వైసీపీ ప్రభుత్వం దళిత ఓట్లు ఉపయోగించుకొని వాళ్ళు సీటు ఎక్కి కూర్చున్నారు కానీ ఓట్లేసిన దళితులకి మాత్రం వాళ్లు వేసుకునే బూట్లు కింద కూర్చోపెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతుంది ఏంటంటే ఒకడు దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తాడు, మరొకడు మాస్క్ లేదని ప్రశ్నించిన డాక్టర్ ని అతి దారుణంగా హింసించి చంపేస్తాడు, తప్పు జరుగుతున్న చోట ఎదురు తిరిగి ప్రశ్నిస్తే అది కిరాతకంగా దాడులు చేస్తారు. ఈ నాలుగు సంవత్సరాలలో దళితులకి అన్యాయం జరుగుతుందే తప్ప న్యాయం జరగట్లేదు. మరి ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్న దళిత నాయకులు ఏం చేస్తున్నారు? దళితులకు మేనమామ అని చెప్పుకొని తిరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డికి దళితులపై జరుగుతున్న దాడులు కనపడట్లేదా? లేదా కనిపించిన పట్టించుకోవట్లేదా? ఈ ప్రభుత్వ వైసిపి నాయకులు మాల, మాదిగలు అని దుర్భాషలతో తిడుతున్నారు. దళితులని. మరి అదే మాల మాదిగ ఓట్లతో గెలిచి సీటు ఎక్కి కూర్చున్నారు ఈరోజు ఈ వైసీపీ నాయకులు. ఇలా తిడుతున్నా కూడా వైసీపీలో ఉన్న దళితుల నాయకులకి సిగ్గు లేదా, మనకి ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ? దళితుల్లారా ఇకనైనా మారండి. మనకి సమాజంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న గౌరవం ఇది. నేను సగర్వంగా చెప్పుకోగలను జనసేన పార్టీలో దళితులకు ఎటువంటి గౌరవము ఉందో అని దానికి ఉదాహరణ నేనే. అయ్యా జగన్ మోహన్ రెడ్డి ఇకపై దళితులు నీకు బానిసలుగా బతకరు దళితులకు న్యాయం జరిపించలేని నువ్వు ఇకపై దళిత మేనమామ అని చెప్పుకోడానికి వీల్లేదు. దళితులపై జరిగిన అన్యాయాలు దాడులపై మీరు స్పందించలేదా ఏ చేత్తో అయితే ఓట్లు వేసాము అదే చేతులతో కూడా తిరగబడగలమని గుర్తుంచుకోమని పాలకొల్లు జనసేన వీరమహిళ రియ ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు.