వి.ఆర్.ఏలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ

పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలం. రాష్ట్ర వ్యాప్తంగా 11 వ రోజు జరుగుతున్న వి.ఆర్.ఏ ల నిరసన దీక్షలలో శుక్రవారం ఓడీసీ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వి.ఆర్.ఏ లు చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ మద్దతు తెలపడం జరిగింది. ఓడీసీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఇస్తున్న 10,500/-రూపాయలతో జీవన సాగించడం కష్టం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కావున వారికి వెంటనే ప్రభుత్వం కనీస వేతనం 21000/-తక్షణమే ఇవ్వాలని, అదే విధంగా నామినిలుగా పని చేస్తున్న వారికి రెగ్యులర్ చెయ్యాలి. సర్వీస్ ని బట్టి వి.ఆర్.ఏ నుంచి వి.ఆర్.ఓ గా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి భారతి సిమెంట్ నిత్యావసర వస్తువులు పెరగాయి తప్ప ఉద్యోగులకు పెంచుతాము అని చెప్పిన జీతాలు పెరగలేదు అని దుయ్యపట్టారు. ఈ కార్యక్రమం లో జనసేన మండల నాయకులు కొండబోయన సతీష్, ధనుంజయ, ప్రసాద్, డేరంగల ఉపేంద్ర, దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.