బొర్రా ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

సత్తెనపల్లి నియోజకవర్గం: నియోజకవర్గ జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో గురువారం గత రెండు రోజుల నుండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వక్రీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మరియు రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టడం అనే విషయాన్ని ఖండిస్తూ.. నియోజకవర్గంలోని నకరికల్లు మండలం, నకరికల్లు అడ్డరోడ్డులో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి వాటి స్థానంలో వారి కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకొని అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థలో జరుగుతున్న లోపాలను తెలియజేస్తే లోపాలను సరి చేసుకోకపోగా ఆ మాటలు వక్రీకరించి రాష్ట్ర ప్రభుత్వమే వాలంటీర్లను రెచ్చగొట్టి బెదిరించి పోలీసులను అడ్డం పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మలు తగలబెట్టడం అనేది నీతిమాలిన చర్యగా, వైసిపి చేతకానితనానికి నిదర్శనంగా పరిగణిస్తున్నామని తెలియజేశారు. అలాగే వాలంటరీ వ్యవస్థ అనేది ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధమైన వ్యవస్థ అని, ఈ వ్యవస్థ ద్వారా అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అనే మాటకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని ఈ పాయింట్ మీద ఎవరు డిబేట్ కి వచ్చినా సిద్ధమని తెలియజేశారు. అలాగే రాజ్యాంగబద్ధమైన స్థానంలో లేని వ్యక్తుల ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల వ్యక్తిగత డేటా దొంగతనం చేస్తున్న అనే మాట ముమ్మాటికి వాస్తవమని తెలియజేశారు. ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని తెలియజేశారు. అలాగే సేకరించిన డేటా వైసిపి నాయకుల ద్వారా అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తుల చేతులకు వెళుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నడిపే రాజనీతి లేక వాలంటీర్ వ్యవస్థ అనే రాజ్యాంగేతర వ్యవస్థను తయారు చేసుకుని ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు నాటకాలు ఆడుతున్నారు అని తెలియజేశారు. వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వైసిపి చేస్తున్న ఆకృత్యాలను చూసి జనసేన పార్టీ బయపడదని పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, నకరికల్లు మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, సత్తనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల ఉపాధ్యక్షులు షేక్ రఫీ, వీరమహిళ పుష్ప నామాల, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొన్నారు.