రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ప్రజా ప్రభుత్వమే

  • ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం: వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామం నందు ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కేర్ టేకర్ ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోండి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మన జీవితాలలో వెలుగులు నింపుకోవడం కోసమే భారత రాజ్యాంగం ఓటు అనే ఆయుధాన్ని మనకు ఇచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ ఓటు అనే ఆయుధాన్ని నీతి, నిజాయితీ గల నాయకుల్ని ఎన్నుకోవడానికి వినియోగించడం మన బాధ్యత. రాక్షస పరిపాలన చేస్తున్న ఈ అవినీతి ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లయింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. నమోదైన దొంగ ఓట్లను గుర్తించి తొలగించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైనే ఉంది. యువతి, యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకొని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నెలకొల్పి ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఐటీ వింగ్ ఇంచార్జ్ పసుపులేటి ప్రసాద్, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు పిన్నిశెట్టి మల్లికార్జున్, షేక్ రహీం, చిరంజీవి యువత సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఖాజా రహమతుల్లా, వెంకటాచలం మండల ప్రధాన కార్యదర్శి శ్రీహరి, సీనియర్ నాయకులు దయాకర్, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.