క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

అమరావతి, జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్స్ పంపిణీ కార్యక్రమం ఆదివారం అమరావతిలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అమరావతి మండల ఉపాధ్యక్షులు రాయి సత్యనారాయణ చేతుల మీదుగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్స్ పంపిణీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమరావతి మండల కమిటీ నాయకులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.