ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి – తగరపు శ్రీనివాస్

తెలంగాణ, హుస్నాబాద్: గత ఏడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ మద్దతు ఉంటుందని, తమ డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేంత వరకు జనసేన పోరాటం చేస్తుందని అన్నారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆశా వర్కర్లతో కలిసి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు మండల అధ్యక్షుడు మల్లెల సంతోష్ ఉపాధ్యక్షుడు కొలుగూరి అనిల్ ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్ సోషల్ మీడియా సెక్రెటరీ రెడ్డి గోపినాథ్ మోరె శ్రీకాంత్ నేవూరి పవన్ తదితరులు పాల్గొన్నారు.