కాకినాడ సిటీ జనసేన ఆధ్వర్యంలో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం జనసేన పార్టీ కాకినాడ సిటీ నియోజకవర్గ ఆఫీస్ నందు జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ వై.సి.పి ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడ స్వరం వినపడినా పోలీసులతో వారి గొంతు నొక్కెస్తోందనీ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుని కూడా హరిస్తోందన్నారు. సుమారు 27 దళిత సంక్షేమ పధకాలను ఆపుచేసి దళితజాతికి తీరని ద్రోహం ఈ ముఖ్యమంత్రి చేసి పైకి నా దళిత సోదరులు, అక్క చెల్లెమ్మలు అంటూ నటిస్తున్నాడన్నారు. సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని అధికారంలోకి వచ్చిన ఈ ముఖ్యమంత్రి, అధికారంలోకి వచ్చాకా అదే మద్యాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు రూపాయలు అప్పుతెచ్చాడని ఇది పేదలు, దళితుల రక్తాన్ని పిండి చేసే వ్యాపారం కాదా అని ప్రశ్నించారు. ఈ వై.సి.పి ప్రభుత్వానికి మానవత్వమే లేదనీ దీన్ని జనసేన తెలుగుదేశం పార్టీల తరుపున తీవ్రంగా ఖండిస్తూ పోరాడతామన్నారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ పటానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, సిటీ ప్రధాన కార్యదర్శి లు సరగడ రమణరెడ్డి, పెద్దిరెడ్డి ఉదయ్ భాస్కర్, సిటీ కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్, సిటీ సహాయ కార్యదర్సులు మొహమ్మద్ షమీర్, మిరియాల హైమవతి, డివిజన్ నాయకులు చోడిశెట్టి శ్రీమన్నారాయణ, బండి సుజాత, బోడపాటి మరియ,సబ్బే దీప్తి, యేలేటి సోనీ ఫ్లోరెన్స్, సుంకర సురేష్, దారపు సతీష్,చీకట్ల శ్రీనివాసు, జంప అప్పల రమణ, తోట లక్ష్మీ నరసింహ కుమార్, రావిపాటి వెంకటేశ్వరరావు, శివాజీ యాదవ్, తోట కృష్ణ తేజ, వాసిరెడ్డి సతీష్(ధోని) తదితరులు పాల్గొన్నారు.