కాపు కులం అభివృద్ధి కోసం మీరు పాటుపడే వారైతే జనసేనానికి మీరు బాసటగా నిలబడాలి

విశాఖ, చేగొండి హరిరామ జోగయ్య ఈ రాష్ట్రంలో ఎంపీగా ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రం పట్ల రాష్ట్ర ప్రజల పట్ల మంచి కోరుకోవాలి కానీ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు చూసి కూడా వైసిపికి కొమ్ము కాయడం, ఇన్ని రోజులు ఆయన మాట్లాడిన మాటలకు, ఆయన రాసిన లేఖలకు వారి కుమారుడు వెళ్లి వైసిపి కండువా కప్పుకోవడంతో మొత్తం తేట తెల్లమైంది. ఇన్ని రోజులు ఈ పొత్తు కోసం వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల్లో మొదటి వారే హరిరామ జోగయ్య. అయ్యా మీరు పెద్దవారు, గౌరవనీయులు, రాష్ట్ర ప్రజలకు రాజకీయ నేతలకు మంచి మార్గాన్ని చూపించాల్సిన మీరే ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు విఘాతం కలిగేలా ప్రవర్తించడం బాధాకరం. మీరు ఇప్పుడు మౌనంగా ఉంటే వైసిపి చేసే ప్రతి అరాచకాన్ని మీరు మద్దతు ఇచ్చినట్టే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంటే అది మంచిది కాదు అని చెప్పాల్సింది పోయి మీరు మద్దతు ఇచ్చినట్టే రాష్ట్రంలో జరుగుతున్న శాండ్ ల్యాండ్ వైన్ మాఫియాకి మీరు మద్దతు ఇచ్చినట్టే. నిజంగా కాపు కులం అభివృద్ధి కోసం మీరు పాటుపడే వారైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మీరు బాసటగా నిలబడాలి. అంతేగాని ఈ విధంగా మా అధినాయకుడుని విమర్శించడం. రాజకీయ దురుద్దేశంతో ప్రవర్తించడం మీలాంటి విజ్ఞులకు సమంజసం కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ అమూల్య సలహాలు సూచనలు సమాజ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, చైతన్య, భార్గవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.