జనసేన నాయకులపై దాడిని ఖండిస్తున్నాం: శశిరేఖ

  • ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ వైసిపి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన పార్టీ మహిళా నాయకురాలు శశిరేఖ

అనంతపురం: ధర్మవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న తరుణంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారి అనుచరుల చేత జనసేన నాయకులు రాజారెడ్డిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నసేన మహిళా నాయకురాలు శశిరేఖ పేర్కొన్నారు. శనివారం శశిరేఖ మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే దాడులు చేస్తారా..? ధర్మవరంలో జనసేన నాయకుడు రాజారెడ్డి పై దాడి చేయడం దారుణమని వైసిపి నాయకుల పిరికిపంద చర్యని భావిస్తున్నాను, మా నాయకులపై ఇన్ని దాడులు చేస్తున్న పోలీసులు చర్యలు తీసుకోకుండా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని శశిరేఖ మండిపడ్డారు.