ప్రజా సమస్యలపై జనసేన అలుపెరుగని పోరాటం చేస్తుంది

  • మేము తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేస్తాం.. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు

నందికొట్కూరు: దేశ పోరాటం ప్రతినిధి పాములపాడు: పాములపాడు మండల కేంద్రంలో జనసేన రాము అధ్యక్షతన, జరిగిన జనసేన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి. స్వాములు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలనను ఎండగడుతూ, జనసేన పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలన్నారు. జనసేన పార్టీ కూడా ప్రజా సంక్షేమం కొరకు అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా తయారయ్యి, జనసేన పార్టీకి అందరూ రాజకీయంగా ఎదగాలన్నారు, గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి గ్రామంలో జనసేన పార్టీకి జన సైనికులు నాయకులుగా తయారవ్వాలనీ పిలుపునిచ్చారు. మేము తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేస్తామన్నారు. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని పాములపాడు మండలం లోనీ జనసైనికులు జనసేన రాము, శీలం శ్రీనివాస్, మధు, రాజు, కుమార్, దిలీప్, నాగరాజు, పెద్దలు మన్యం పుల్లయ్య, రామకృష్ణ, శివన్న, నారాయణ, పవన్, శ్రీను, ఎర్ర గూడూరు రాజు, స్వామీ నాయక్, రామ బ్రమ్మం, భాను, తదితర నాయకులు శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసైనికులు, పాములపాడు మండల జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.