బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి రంగా

గురజాల: పిడుగురాళ్ల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయ కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో నూతి నారాయణ నేతృత్వంలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి వంగవీటి మోహనరంగా గారని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కూడా ఆయన చూపిన బాటలో బడుగు బలహీన వర్గాలను కలుపుకొని వారికి న్యాయం జరిగేందుకు మేమంతా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల నాంచారయ్య, కామిశెట్టి రమేష్, కామిశెట్టి అమరలింగేశ్వరరావు, నూతి సూర్యనారాయణ, దూదేకుల ఖాసిం సైదా, చిలుకూరి శ్రీనివాసరావు, ఫైనాన్స్ సాంబశివరావు, గుర్రం కోటేశ్వరరావు, వాషర్ బుడే, మస్తాన్ వలి, దేశినేని మోహన్ రావు, ఆముదాల గంగాధర్, యలమల శ్రీనివాసరావు, కోలా పుల్లారావు, మల్లం శెట్టి లక్ష్మణరావు, నకరికంటి శివ, నర్సి, తోట శ్రావణ్, వడ్డవల్లి సాంబశివరావు, సురేష్, కత్తెరపు వాసుదేవరెడ్డి, వడ్డవల్లి శ్రీను, కుందుర్తి గురవాచారి, గండికోట కోటేశ్వరరావు, పసుపులేటి నరసింహారావు, ఆవుల రమేష్, కొమిరిశెట్టి సతీష్, బేతంచర్ల నాగేశ్వరరావు, తోటా రామదాసు, వీరాంజనేయులు, తుమ్మలచెరువు ఆంజనేయులు, బేతంచర్ల ప్రసాద్, దాసరి శ్రీనివాసరావు, కిరణ్ కుమార్, ముక్కంటి, మధు తదితరులు పాల్గొన్నారు.