అధికారులపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏలూరు జనసేన డిమాండ్

ఏలూరు నియోజకవర్గంలోని సుంకర వారి తోటలో గాంధీ అనే వ్యక్తి పైన స్థానిక కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ వాళ్ళ ఇంటిపైన ఇళ్ళు వేసుకుంటూ ఉంటే పర్మిషన్ లేదని చెప్పేసి మీరు మీ ఇళ్ళు అక్రమంగా వేశారని చెప్పి వాళ్ళ దగ్గర కొంత డబ్బును డిమాండ్ చేస్తూ ఇప్పటికీ వారం రోజుల నుండి మానసికంగానే వేధిస్తున్నటువంటి పరిస్థితులు చూశాం. దాంతో మనస్థాపం చెంది గాంధీ అనే వ్యక్తి (ఆటో డ్రైవర్) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని సోమవారం హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. బాధితుడిని జనసేన పార్టీ ఏలూరు ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ… ఈరోజు ఏలూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం యొక్క అండదండలు చూసుకుని స్థానికంగా గెలిచినటువంటి కొంతమంది కార్పోరేటర్లు ప్రజలపై ఆంబోతు లాగా వారిని వేధిస్తూ డబ్బులు గుంజే ప్రక్రియ అనేది చాలా తీవ్ర స్థాయిలో మొదలైంది. ఇది ఒక చోట కాదు అన్ని చోట్ల కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది.. దీనిని జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ యొక్క పరిస్థితికి కారణమైనటువంటి ఎవరైతే కార్పోరేటర్లు వారికి సహకరించిన అధికారులపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏలూరు జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.