జనసేన-టిడిపి ఉమ్మడి ర్యాలీ

విజయనగరం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం నియోజకవర్గంలో మగళవారం స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ నుంచి జనసేన-టిడిపి ఉమ్మడి పార్టీల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో విజయనగరం జనసేన-టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి పూసపాటి అతిథి గజపతిరాజు మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి కలిసి ర్యాలిని ప్రారంభించారు. భారీ జన సందోహంతో 6 వార్డులు పర్యటించారు. ప్రతి వార్డులో భారీగా జనాలు పాల్గొని హారతులతో పూలదండలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.