చెన్నడం గ్రామంలో వైసిపికి భారీ షాక్

రాజోలు మండలం, చెన్నడం గ్రామంలో వైసీపీ పార్టీ ఎస్ సి సామాజికవర్గనికి చేస్తున్న అన్యాయాన్ని, వారికి రావాల్సిన 27 పథకాలు రద్దు చెయ్యడం, 19% ఉన్న రిజర్వేషన్ లు 12% ఇచ్చి దళితులను అణగదొక్కుతూ ఎదుగుదల లేకుండా తన సామాజిక వర్గానికీ అన్ని పదవులు ఇచ్చుకుని ఎందుకు పనికీరాని పదవులతో పక్కన పెడుతున్న వైసిపి నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని నిర్ణయం తీసుకుని జనసేన టీడిపి బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దేవ వరప్రసాద్ మరియు సిని నటుడు స్టార్ కెంపైనర్ పృధ్వీ రాజ్ సమక్షంలో ఎస్సీ సామాజిక వర్గానికీ చెందిన బీఎస్పీ సీనియర్ నాయకులు బడుగు సాయిబాబుతో పాటు వైసిపి పార్టీకి చెందిన మట్టా గిరిధర్, యాలంగి శేఖర్, కుసుమ రవితేజ, కుసుమ పవన్, మట్టా మధు, మట్టా రత్న శేఖర్, యడ్ల నాని, యలంగి మురళీ కృష్ణ, సరేళ్ళ లీల కుమార్, వడ్డీ ప్రదీప్, బడుగు సుకుమార్, నితిపూడి రమేష్ బాబు, బొంతు బంటి, యాళంగి మురళీ, మట్టా గణేష్ తదితరులు చేరారు.