సొంత ఖర్చుతో గ్రామానికి నీళ్లు

అచ్చంపేట మండలం ఆర్ అండ్ ఆర్ సెంటర్ నందు భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల ఆర్ అండ్ ఆర్ సెంటర్ గ్రామ ప్రజలు నీటికి ఇబ్బంది పడుతున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి దేశెట్టి అనంత నాయుడు ఇంట్లో ఉన్న బోరు నుండి 750 అడుగుల పైపును సొంత డబ్బులతో కొని గ్రామంలో నీరు కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలకు నీరును అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమరావతి సాంబశివరావు, నెల్లూరు సీతారామయ్య, వసంతరావు, అంబేద్కర్ గోపి రమణారెడ్డి, మహేష్ జేమ్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.