తగరపు శ్రీనివాస్ అధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి రావడానికి కృషి చేసినా తెలంగాణ సాయుధ పోరాటయోధులను స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మల్లెల సంతోష్, నేవూరి పవన్, కొంకటి రాజేష్, మొలుగూరి శ్రీధర్, చెంచల గణేష్, కొంకటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.