APPSC గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులు పరీక్ష కేంద్రాల ఆప్షన్లను నమోదు చేసుకోవడానికి చివరి తేదీ

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌1-2018 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ అభ్యర్థులకు సంబంధించి పరీక్ష కేంద్రాల ఎంపికపై ఆప్షన్ల నమోదుకు ఏపీపీఎస్సీ మరో అవకాశం కల్పించింది.

అభ్యర్థులు ఆగస్టు 31 లోపు ప్రాధాన్యతా క్రమంలో 3 పరీక్ష కేంద్రాలకు ఆప్షన్లు ఇవ్వవచ్చని కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు పేర్కొన్నారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, హైదరాబాద్‌ల్లోని కేంద్రాల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ కేంద్రాల్లో అభ్యర్థుల అనుకూలతను బట్టి మూడింటికి ఆప్షన్లను ఇవ్వవచ్చు. కానీ సదుపాయాల అందుబాటును అనుసరించి కేంద్రాలను కేటాయించే అధికారం కమిషన్‌దేనని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఇక గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను నవంబర్ 2 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు.

అభ్యర్థులు పూర్తి వివరాలను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడగలరు .