అమలాపురం అల్లర్ల ఘటనపై మీడియా సమావేశంలో పాల్గొన్న పితాని బాలక్రిష్ణ

కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్: అమలాపురంలో మంగళవారం జరిగిన అల్లర్ల ఘటనపై కాకినాడ ముత్తా క్లబ్ లో జనసేన నాయకుల సమక్షంలో బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్చార్జ్ పితాని బాలక్రిష్ణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా జనసేన నాయకులు వైసిపి ప్రభుత్వంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.