పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత యు.పి.రాజు

రాజాం పరిసర ప్రాంతాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజాం నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ… పర్యావరణాన్ని పరిరక్షించే విధానం జనసేన సిద్ధాంతాల్లో ఒకటని, మానవాళికి అత్యంత గొప్ప ఆస్తి పర్యావరణం అని, భావితరాలకి మనమందించాల్సిన వారసత్వ సంపద పర్యావరణం అని,, ప్రకృతిపై హక్కు ఎంతుందో పరిరక్షించుకోవాల్సిన భాద్యతా అంతే ఉంది అని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేనతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవింద్ రావు, ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల రమేష్, రెడ్డి బాలకృష్ణ, వెంకట నాయుడు, అనుదీప్, దాలి నాయుడు, జయకృష్ణ, సింహాచలం ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.