గుడ్ మార్నింగ్ సీఎం సార్: చిట్వేలి జనసేన

చిట్వేలి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శుక్రవారం చిట్వేలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరుతో డిజిటల్ క్యాంపైన్ జరపడం జరిగింది.

ఈ సందర్బంగా చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాలలో 22,750 కోట్లు బడ్జెట్ లో రోడ్ల కోసం ప్రవేశపెట్టినా.. ఎక్కడా రోడ్డు వేసిన పాపాన పోలేదు అని ఏద్దేవా చేశారు.

పెట్రోలు మీద ఒక సంవత్సరానికి సెస్ వసూలు 750 కోట్లు వస్తోందని.. ఈ మూడు సంవత్సరాల సెస్ వసూలు ఏమయిందని, మరియు సెస్ ను తనఖా పెట్టి తెచ్చిన అప్పు 6500 కోట్లు ఏమయిందని నిలదీశారు.

అలాగే కోడూరు చిట్వేలి రోడ్డు దశాబ్దాలు అయినా ఈ రోడ్డు ను పట్టించుకునే నాయకులు కరువయ్యారని మాదాసు నరసింహ అన్నారు. కంచర్ల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి సమావేశంలో మాట్లాడుతూ జులై నెల 15 వ తారీఖు నాటికి రోడ్లు అన్నీ వేసి ప్రతిపక్షాల నోరు మూపిస్తాను అన్నారు. మరి ఇదేంటి సర్ ఎక్కడ ఒక రోడ్డు కూడా వెయ్యలేదు.. ఇకనైనా రోడ్లన్నీ పూర్తి చెయ్యాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే రోడ్డు వదిలేస్తే ఇక్కడ ప్రజలే మీకు బుద్ధి చెబుతారని సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కొనిశెట్టి చక్రి, మాదాసు శివ, పగడాల శివ, మాదినేని హరిబాబు, కడుమూరి సుబ్రహ్మణ్యం, నీలి మురళి కృష్ణ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.