ప్రమాదానికి గురైన యువకుడిని పరామర్శించిన వడ్లపట్ల సాయి శరత్

జంగారెడ్డి గూడెం: సోమవారం రాత్రి సమయంలో జంగారెడ్డి గూడెం రోడ్డులో వేగవరం వద్ద బస్సు ఢీకొని ప్రమాదానికి గురైన యువకుడిని జనసేన జిల్లా కార్యదర్శి వడ్లపట్ల సాయి శరత్ ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దుర్ఘటన జరిగిన గంటన్నర వరకు ఆంబులెన్స్ రాలేదన్న విషయం తెలుసుకుని ప్రభుత్వ పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు.