వర్షాకాలం మొదలైంది.. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు నిర్మాణం చేపట్టాలి: జె. బాషా

సత్యవేడు నియోజకవర్గం, బి.ఎన్ కండ్రిగ మండలంలోని నెరినికండ్రిగ, కారనిమిట్ట, ఎన్టీఆర్ నగర్ గ్రామంలోని రహదారులు దగ్గర మండల అధ్యక్షులు జె. బాషా ఆధ్వర్యంలో #GoodMorningCMsir జనసేన డిజిటల్ క్యాంపైన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా బాషా మాట్లాడుతూ.. ఎలక్షన్ ముందు పాదయాత్ర చేయడం కాదు జగన్ రెడ్డి గారు.. దమ్ముంటే ఇప్పుడు పాదయాత్ర చేయండి. ప్రజలు, గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఇబ్బందులూ పడుతున్నారో తెలుస్తుంది, వర్షాకాలం మొదలైంది యుద్ధ ప్రాతిపదికన రోడ్లు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాము, ఇంకనైనా నిద్రలేవండి లేదంటే మిమ్మల్ని ఎలా నిద్రలేపాలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి బాగాతెలుసు.. మా జనసైనికులకు బాగా తెలుసు అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, హరి, మారయ్య, మురళి, శంకరయ్య, వెంకటముని, మురళి, చందు, పవన్, దయాకర్, నవీన్, ధనశేఖర్, ఢిల్లీ, ప్రకాష్, కిషోర్, శ్రావణ్ పాల్గొన్నారు.