ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణపై భౌతిక దాడి అమానుషం: అంకె ఈశ్వరయ్య

అనంతపురం జిల్లా ఏబీఎన్ జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ నాయకుల దాడిని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య అన్నారు. రాప్తాడులో జరిగిన సిద్ధం బహిరంగ సభకు ఏబీఎన్ తరఫున జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణ హాజరు కావడం జరిగింది. సిద్ధం బహిరంగ సభను కవర్ చేస్తున్న కృష్ణపై వైసిపి నాయకులు వైసిపి గూండాలు విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా ఉన్న మీడియా ప్రతినిధులపై భౌతిక దాడులకి పాల్పడడం హేయమైన చర్య. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.