మంచి నీటి సమస్య పరిష్కరించాలి: జనసేన వినతి పత్రం

శింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం మండలం, జనచైతన్య కాలనిలో నీటి సమస్య ఎక్కువగా ఉండటం వల్ల జనచైతన్య కాలని పరిధిలో ఉన్న గ్రామ సచివాలయం వి.ఆర్.ఓ కు అలాగే బుక్కరాయసముద్రం పంచాయతీ కార్యాలయంలో అధికారులకు నీటి సమస్య పై అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కమిటీ సభ్యులు. అరటి తాహిర్, షేక్ ఆరీఫ్, షేక్ ఖాజా హుస్సేన్, సద్ధాం ఖాన్, షేక్ దావూద్ తదితరులు పాల్గొన్నారు.