ఓనురు గ్రామ యువతకు వాలీబాల్ కిట్ ని బహుకరించిన గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జనసేనపార్టీ ప్రదాన కార్యాలయంలో జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ ఆధ్వర్యంలో పాడేరు, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జి డా.వంపురు గంగులయ్య చేతుల మీదుగా శుక్రవారం వంటలమామిడీ పంచాయితీ ఓనూరు గ్రామ యువత జనసేన పార్టీ కండువా కప్పుకుని పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు మావంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. అలాగే యువత జనసేన పార్టీకి ప్రధాన బలమని భవిష్యత్ తరాల మంచికొరకు కేవలం యువత మాత్రమే చైతన్యవంతమైన రాజకీయలవైపు ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ బలోపేతనికి మనమందరు కలిసి పనిచేయాలని డా.గంగులయ్య తెలిపారు. మండల అధ్యక్షులు నందోలి మురళికృష్ణ మాట్లాడుతూ ఇకపై నియోజకవర్గ స్థాయిలో పలు గ్రామాల్లో సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఒకవైపు ప్రజలకు చైతన్యం తీసుకొచ్చే విధంగా పలు కార్యక్రమాలు చేపడతామని కచ్చితంగా 2024 ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గంలో జనసేన అసెంబ్లీ స్థానం గెలుపుకోసం అహర్నిశలు శ్రమిస్తామని ఓనురు గ్రామ యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఓనురు గ్రామ యువతకు ఇన్చార్జి వాలీబాల్ కిట్ ని బహుకరించినందుకు ఓనురు గ్రామ యువత ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సమావేశంలో అరకుపార్లమెంట్ ఎగ్స్క్యూటివ్ మెంబర్ కమల్ హాసన్, మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, ఓనురు గ్రామయువత జనసైనికులు, పాంగి సిద్ధు, మర్రి చిట్టిబాబు, పాంగి చిరంజీవి, పాంగి శివాజీ, పి.చిరంజీవి, జి.చిరంజీవి, కొర్ర రాజు, కొర్ర కొండబాబు, సీదారి మహేష్, మర్రి కిరణ్, పాంగి ప్రవీణ్, కొర్ర సురేష్ పాల్గొన్నారు.