పెదకూరపాడులో జనసేన భవిష్యత్తు కార్యాచరణ చర్చలు

పెదకూరపాడు నియోజకవర్గ నాయకులతో మండల అధ్యక్షులతో మరియు కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సమావేశమైన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు.
పెదకూరపాడు నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి మరియు భవిష్యత్తులో పార్టీ ఎదుగుదలకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అలాగే నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను మరియు అన్యాయాలను అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని భవిష్యత్తులో వాటి పరిష్కారానికి జనసేన పార్టీ ఏ విధమైన కార్యాచరణ చేయాలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నారదాసు రామచంద్ర ప్రసాద్, యర్రంశెట్టి రామకృష్ణ, మండల అధ్యక్షులు కడియం శివనాగేశ్వరరావు, మట్టం వీరభద్రరావు, మల్లెల వెంకటచలపతి, తోట రమాదేవి, శాఖమూరి శ్రీనివాసరావు, శివరీలు, కోమారాల రమేష్, చెంచయ్య, అద్దేపల్లి రమేష్, పెమ్మా అతిలేష్, సురేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.