మండల వ్యాప్తంగా మురికినీటి వ్యవస్థపై చర్యలు తీసుకోండి

  • జనసేన, బి.జె.పి

ఉరవకొండ: మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులనున్న మురికి కాలువలకు మరియు రోడ్డుపై మురికి నీరు నిలిచిన చోట బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ చేయాలని బెలుగుప్ప మండల ఎం.పి.డి.ఓ అధికారి జి.ఎస్ రాంచంద్రకు బి.జె.పి.మరియు జనసేన మండల అధ్యక్షులు వన్నూరుస్వామి, కాసంశెట్టి సుధీర్ వినతి పత్రం అందజేసారు. రోడ్డుపై నీరు నిలవడం వల్ల విష జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని, ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామ కార్యదర్శికి ఈ మురుకి నీటిపై వెంటనే చర్యలు చేపట్టేలా చుడాలని వినతిపత్రంలో పేర్కోవడం జరిగిందని బి.జె.పి. జనసేన మండల అధ్యక్షులు వన్నూరుస్వామి, కాసంశెట్టి సుధీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పయ్య, నాని పాల్గొన్నారు.