నాదెండ్ల మనోహర్ పర్యటన విజయవంతం చేయండి: శిరిగినీడి వెంకటేశ్వరరావు

అంబాజీపేట గ్రామంలో జనసేన పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో దొమ్మేటి సాయికృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పి.గన్నవరం నియోజకవర్గ స్థాయిలో ఉన్న అంబాజీపేట గ్రామంలో ఏ.వి.ఆర్, వై.వి.ఆర్ కల్యాణ మండపం నందు మంగళవారం నాడు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ రావడం జరుగుతుందని, నాదెండ్ల మనోహర్ పర్యటన ప్రతి జన సైనికుడు విజయవంతం చేయాలని అలాగే క్రియాశీలక సభ్యుత్వం తీసుకుని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులైన చెరుకూరి పనస రాముడు కుటుంబ సభ్యులకు నాదెండ్ల మనోహర్ చేతులు మీదుగా 5 లక్షల చెక్కు అందించడం జరుగుతుందని అనంతరం ఎస్ సి, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు అత్యధిక సంఖ్యలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరతారని నియోజకవర్గంలో మండలాల వారీగా క్రియాశిలక సభ్యత్వం చేసిన వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా వారికి మనోహర్ చేతుల మీదుగా చిరు సత్కారం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకపల్లి దొరబాబు (ఎంపీటీసీ), కుడుపూడి రాంబాబు (ఎక్స్ఎంపీటీసీ), మట్టపర్తి సోమేశ్వరరావు, అరిగేల సూరిబాబు, పితాని రామకృష్ణ, నూకపెయ్యి సూర్యచంద్రరావు, జొన్నాడ మెరిగ్రేస్ ,కొర్లపాటి ఢిల్లీ, చప్పిడి రాజు,రవణఒ విజయ్, పళ్ళ రామూర్తి, వీర భవాని శంకర్, కీర్తి శ్రీను, కుడుపూడి రాంబాబు, గుండాబత్తుల రాంబాబు, పితాని వెంకటేశ్వర్రావు, పేరాబత్తుల వెంకట నరసింహారాజు, గంధం గణేష్, బొరుసు రాజు, నల్లా కిషోర్, మంచాల నోకేష్, యర్రంశెట్టి నాగేంద్ర, కొప్పినీడి సాయి సూర్య, బోనగిరి భూషణ్ నాయుడు, తోట బాబీ, మట్టా సురేష్, భావన బాబులు, బందన రంగా, నందెపు శ్రీను, వంగ చిన్న, బీర సూర్యప్రకాష్ రావు, పేరాబత్తుల కాసు, పేరాబత్తుల సురేష్, పేరాబత్తుల నర్సింహా రావు,మట్టపర్తి రమేష్, తదితరులు పాల్గొన్నారు.