గంజి గోవిందరాజును పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, నరసింగపురం గ్రామానికి చెందిన అలుపెరగని నిస్వార్థ జ సైనికుడు, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తి గంజి గోవిందరాజు ఇటీవల బైక్ యాక్సిడెంట్ కారణంగా కాకినాడ అహోబిల్లా హాస్పటల్ నందు చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ గోవిందరాజును పరామర్శించి, తనకు చికిత్స చేస్తున్న వైద్యులను తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని క్షుణ్ణంగా పరిశీలించి తగిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేల్పుల చక్రధర్, పల్నాటి మధు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, శివరామకృష్ణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.