పాలకొండ నియోజకవర్గం లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం నౌగాడ, పాత పనుకు వలస గ్రామాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు నియోజకవర్గంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అధినేత స్పూర్తితో శనివారం కొంతమంది రైతులతో ముఖ్య అంశాలు మాట్లాడం జరిగింది. జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా రైతులకు అండగా ఉంటారో వివరించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు(100000) చొప్పున పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఆకుటుంబాలను ఆదుకుంటున్నారని తెలియజేయడం జరిగింది.పవన్ కళ్యాణ్ రైతు పక్షాన నిలబడతారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, నియోజకవర్గం నుండి ఉమ్మడిశ్రీకాకుళం జిల్లాప్రోగ్రామ్ కమిటీ మెంబర్ ప్రశాంత్ పోరెడ్డి, శ్రీకాంత్ సింహాద్రి, గణేష్, వేణు గోపాల్, రవి, రాజేష్, భాస్కర్ చిరంజీవి, సూర్యా రావు చంద్రయ్య, గేశయ్య సాయి పాల్గొన్నారు.