రాబోయే ఎన్నికల బరిలో ఖమ్మం అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ పోటీ

  • మిరియాల రామకృష్ణను బలపరచి, జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పని చేయాలని పిలుపు నిచ్చిన జనసేన పార్టీ నాయకులు

ఖమ్మం: జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గ కోఆర్డినేటర్ గా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించిన మిరియాల రామకృష్ణను బలపరచి, జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పని చేయాలని జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ రామకృష్ణ మిరియాల ఆధ్వర్యంలో జరిగిన జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతం గురించి, పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు గురించి చర్చించారు. పార్టీని సంస్థాగత నిర్మాణం చేసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ, రానున్న సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు సమిష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు దుంపటి శ్రీనివాస్, మిరియాల జగన్మోహన్, జిల్లా నాయకులు సాదిక్ అలీ, మిరియాల రామకృష్ణ, డేగల రాము, మెడబోయిన కార్తీక్, గుంత అనూష, బండారు రామకృష్ణ, అజయ్ యాసమనేని, కళ్యాణ్ కిశోర్, కొండాపవన్, డేవిడ్, ప్రభాకర్, గుండ్ల పవన్ కళ్యాణ్, గుంత సత్యనారయణ, సాయి, పుల్లారావు లింగాల, మాలిక్, శ్రీకాంత్, దేవేందర్, రమణ కుమార్, ఉస్మానియా విద్యార్థి నాయకులు మహేష్ పెంటల తదితరులు పాల్గొన్నారు.