రెడ్నం సూరిబాబును కలిసి ధైర్యం చెప్పిన మాకినీడి శేషు కుమారి

పిఠాపురం, గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ జనసైనికుడు రెడ్నం సూరిబాబు కు ధర్మవరంలో గ్రామంలో గల స్టూడియో విద్యుత్ షాక్ గురై ఆ స్టూడియో కు సంబంధించిన కెమెరాలు ఎక్విప్మెంట్ కాలిపోవడం జరిగింది. జన సైనికుల ద్వారా విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జి
శ్రీమతి మాకినీడి శేషు కుమారి తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ను కొడవలి వారి గ్రామంలో పరామర్శించారు. విద్యుత్ షాక్ కి గల కారణాలు అడిగి తెలుసుకునీ వారికి ధైర్యం చెప్పారు. బాధితులకు ఎల్లవేళలా జనసేన పార్టీ తోడు ఉంటుందని భరోసానిచ్చారు. అలాగే ఆ గ్రామంలో కొంతమంది గ్రామ పెద్దలను కలిసి పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు కౌలు రైతులకు చేస్తున్న సాయం అలాగే ఈ రాష్ట్రానికి అసలైన నాయకుడని వివరిస్తూ ఒక్కసారి జనసేన వైపు చూడండి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరాది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, నక్క నారాయణమూర్తి, కంద సోమరాజు, మత్స శ్రీను, మల్లిపము కోటేశ్వరరావు, మద్దాల శ్రీను, నక్క ప్రకాష్, నక్క హరీష్, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.