జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు పోస్టర్ ఆవిష్కరణ

శ్రీకాళహస్తి: పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10 వ తేదీ నుండి 28 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గురువారం శ్రీకాళహస్తి పట్టణంలో వినుత నివాస గృహం వద్ద ఆవిష్కరించడం జరిగింది. ముఖ్య నాయకులు, క్రియా వాలంటీర్ సభ్యులతో సమావేశం నిర్వహించి నాయకులు, జనసైనికులకు దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది. 500 రూపాయలు వెచ్చించి క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయల భీమా మరియు ఆక్సిడెంట్ భీమా కింద 50,000 రూపాయలు వైద్యంకి నగదు అందివనున్నట్టు తెలిపారు. కార్యకర్తల కోసం ఇంత బరోసా ఇచ్చిన రాజకీయ పార్టీ దేశంలోనే జనసేన మొట్ట మొదటి పార్టీ అని తెలిపారు. నియోజకవర్గ నాయకులు, జనసైనికులు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేసి పార్టీ మద్దతుదారులకు, కార్యకర్తలకు తెలియజేసి అత్యధిక సభ్యత్వాలు చేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్, నాయకులు గణేష్, బాలాజీ, రవి కుమార్ రెడ్డి, చందు చౌదరి, గిరీష్, వెంకటరమణ, క్రియా వాలంటీర్ సభ్యులు పాల్గొన్నారు.