నవ వధువుకు డాక్టర్ కందుల బంగారు తాళిబొట్టు, పట్టుచీర అందజేత

వైజాగ్ సౌత్: సేవే దైవంగా భావిస్తూ నిర్వీరామంగా పలు కార్యక్రమాలను చేపడుతున్న దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు శనివారం ఉదయం 35వ వార్డులో స్ప్రింగ్ రోడ్ ప్రాంతంలో నవ వధువు విజయకు బంగారు తాళిబొట్టు, పట్టు చీరను అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో నిర్వీరామంగా తాను పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. తాను చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెళ్లి కూతురు విజయ, తల్లి లక్ష్మి, తండ్రి దుర్గారావు, 35వ వార్డు జనసేన నాయకులు రఘు, మోహన్, రాజు, సత్యనారాయణ, కోటి, ఎర్ర కనకరాజు, అరుణ, కోమలి, సాయి, జానకి, రాజేశ్వరి, దుర్గ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.