పోడూరు మండలం జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభం

పాలకొల్లు, జనసేన పార్టీ పోడూరు మండల కార్యాలయం జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు ఆదివారం ప్రారంభించారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పాలకొల్లు జనసేన పార్టీ విజయం పోడూరు మండలం నుండే మొదలవుతుంది, గెలుపే లక్ష్యంగా అందరం పనిచేద్దాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర పిఏసి సభ్యులు చేగొండి సూర్య ప్రకాష్, బోణం చినబాబు, అల్లు రాధాకృష్ణ, సిద్దిరెడ్డి అప్పారావు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ ఉన్నమాట్ల ప్రేమకుమార్, జిల్లా నాయకులు బండారు రాజేష్, బొలిశెట్టి రమేష్ మరియు యలమంచిలి మండల అధ్యక్షులు కొరవటి వరబాబు, పాలకొల్లు మండల అధ్యక్షులు జానీ, వీరమహిళలు జిత్తుక రియా, మైగాపుల పద్మజ, మరియు పాలకొల్లు జనసేన నాయకులు నల్లమోతు ప్రసాద్, డేగల సత్తికొండ, తులా రామలింగం, కొమ్ముల దినేష్, పితాని వెంకటేష్, ఎంపిటిసి లు మనేపల్లి శ్రీధర్, యర్రంశెట్టి నరసింహారావు, సర్పంచ్ ఇదా సువర్ణరాజు, మరియు జనసైనికులు ఇనుకొండ రమేష్, లంక చంద్రబోస్ పాల్గొన్నారు.