పోలవరం నియోజకవర్గ జనసేన ప్రచార రధాన్ని ప్రారంభించిన నాదెండ్ల

భీమవరం: పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ప్రచార రధాన్ని శనివారం భీమవరంలో జనసేన పచ్ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఇకనుండి నిత్యం ప్రజల్లో ఉంటానని తప్పకుండా పోలవరం గడ్డపై జనసేన జెండా రెపరెప లాడించేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా, అద్యక్షులు కొటికలపూడి గోవిందరావుతో పాటు, రాష్ట్ర నాయకులు పాటు ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యధర్శి గడ్డమణుగు రవికుమార్‌, పోలవరం నియోజకవర్గ ఏడు మండలాల అధ్యక్షులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.