ఛలో మచిలీపట్నం పోస్టర్ ఆవిష్కరించిన వేమూరు జనసేన

వేమూరు: జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేక్ కటింగ్ మరియు చలో మచిలీపట్నం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మండూరు గ్రామం, చుండూరు మండలం, వేమూరు నియోజకవర్గంలో చుండూరు మండల ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా గుంటూరు జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ, వేమూరు జనసేన నాయకులు తాటికొండ శివరామకృష్ణ, బ్రహ్మం, పోకల శ్రీనివాసరావు పాల్గొన్నారు. చుండూరు మండలం జనసేన నాయకులు భాస్కర్, విష్ణు వర్ధన్, గోపి, రెడ్డి రాము, దేవిరెడ్డి సురేష్, గోళ్ళ సాయి బాలాజీ, అనిల్ కుమార్, శ్రీను, రెడ్డి గోపి పాల్గొన్నారు. చుండూరు మండలం జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మార్చ్ 14 మచిలీపట్నం సభ విజయవంతం చెయ్యాలని మరియు 2024 లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చెయ్యాలి అని సోమరౌతు అనురాధ, దేవిరెడ్డి మహేష్, శివరామకృష్ణ, పోకల శ్రీనివాసరావు జనసైనికులకు విజ్ఞప్తి చేశారు. అవినీతి, అసమర్ధ పాలన పోవాలి అని జనసేన ప్రభుత్వం రావాలి అని తాటికొండ శివరామకృష్ణ ఆకాంక్షించారు.