దేవరపల్లిలో జనసేన చలివేంద్రం

మాడుగుల నియోజకవర్గం, దేవరపల్లి మండలం, సుమారు 125 పైగా గ్రామాల నుంచి రైతుల పాల్గొనే తిమరం సంతలో దేవరపల్లి మండల నాయకులు గొర్రుపోటు రామ్మూర్తినాయుడు సహకారంతో దేవరపల్లి మండల జనసేన నాయకుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి శుక్రవారం జరిగే ఈ సంతలో వేసవి అన్ని రోజులు ప్రజలకు ఉచిత మజ్జిగ అందుబాటులో ఉంటుందని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు మరియు కుమార హేమంతు సురాధి శివ దుర్గారావు, అత్యధికంగా పాల్గొన్నారు.