సీనియర్ సిటిజన్స్ గౌరవ కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో కాకినాడ సిటిలోని సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకుని వారి అనుభవ పాఠాలతో సూచనలు కోరుతూ సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం కార్యక్రమం కాకినాడ సిటి సహాయ కార్యదర్శి వాడ్రేవు లోవరాజు ఆధ్వర్యంలో 39వ డివిజన్ గాంధీనగర్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు సీనియర్ సిటిజన్స్ ని వారి ఇండ్లకు వెళ్ళి కలుసుకుని వారియొక్క క్షేమ సమాచారం తెలుసుకున్నారు. వారిని కలిసి వారు స్వతంత్ర పోరాటం దగ్గరనుండీ నేటి ప్రస్తుత పరిస్థితులను వాతావరణాన్ని చూసారంటూ వారి అనుభవాన్ని జతచేస్తూ నేడు ప్రజల సంక్షేమంలోను, పాలనలోను తీసుకొనవలసిన ముఖ్యమైన నిర్ణయాలను మెరుగైన సూచనలతో జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్ళేందుకు తమ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రూపంలో సూచించవలసినదిగా కోరుతూ వారికి పోస్టల్ కవరుని అందచేసి విజ్ఞప్తి చేశారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీనియర్ సిటిజన్స్ అంటే అస్సలు గౌరవంగానీ, మర్యాద గానీ లేవనీ పెన్షన్ 3 వేల రూపాయలు చేస్తానని వాగ్దానం చేసి ఇప్పటికీ 3 వేలు చేయలేదని విమర్శించారు. ఆ ఇచ్చే పెన్షన్ కూడా నెల నెలా సమయానికి వేయట్లేదనీ ఈ రకంగా సీనియర్ సిటిజన్స్ ని నిర్లక్ష్యం చేయడం జనసేన పార్టీ ఖండిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల హైమవతి, చీకట్ల శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.