పవన్ అన్న ప్రజా బాట 39వ రోజు

వైజాగ్ సౌత్: విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమం 39వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 41వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజలు అందరూ పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ మెజారిటీ సీట్లు సాధించడం ఖాయమని స్పష్టం చేసారు. దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింతగా బలోపేతం అవుతుందని అన్నారు. ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సీనియర్ నాయకుడు ఆంటోనీ శేఖర్, ప్రసాద్, తెలుగు అర్జున్, లక్ష్మీ, కుమారి, దుర్గ, అప్పారావు, వరద శ్రీను, కేదార్నాధ్, బదిరీనాధ్, గాజుల శ్రీను, రామారావు తదితరులు పాల్గొన్నారు.