మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా గోరంట్లలో రక్తదాన శిబిరం

పెనుకొండ: పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 68వ జన్మదినం సందర్భంగా చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవని రవికుమార్ ఆదేశాల మేరకు మంగళవారం గోరంట్లలోని ఎయిర్టెల్ టవర్ దగ్గర గల మను గోడౌన్ దగ్గర ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఉదయం నుంచే మెగా అభిమానులు జనసైనికులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. అక్కడే కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు మాట్లాడుతూ మెగాస్టార్ అంటేనే సేవ.. సేవ అంటే మెగాస్టార్ బ్లెడ్ బ్యాంక్, ఐ.బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఇలా చాలా సేవ కార్యక్రమాలు చేస్తూ దేశానికే ఆదర్శ ప్రాయుడు ఆయన అభిమానులుగా మేము కూడా ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం అని వారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత పెనుకొండ నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేష్, గోరంట్ల మండల అధ్యక్షుడు మను, జనసేన జిల్లా కార్యదర్శి సురేష్, మండల అధ్యక్షుడు సంతోష్, రాఘవేంద్ర, బాబర్ గంగరాజు, బాలు, కాలనీ శ్రీనివాసులు, రమేష్, శ్రీరాములు, తిరుపల్, నాగేష్, మెగా అభిమానులు శివ, సీన రాజేష్, జయకృష్ణ, రవి, పురుషోత్తం, పుట్టపర్తి చంద్ర, హిందూపురం హానుమంతు, కన్నా తదితరులు పాల్గొన్నారు.