ఆంధ్రప్రదేశ్ లో త్వరలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో  త్వరలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్క్ ఏర్పాటుకు కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీ కు అప్పగించింది. తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా వచ్చే 8 ఏళ్లలో 46 వేల 4 వందల కోట్ల అమ్మకాలు జరగవచ్చని అంచనా ఉంది. ఈ పార్క్ ఏర్పాటుకు దాదాపు 6 వేల 940 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలుస్తోంది. ఈ పార్క్ ఏర్పాటే కాకుండా ప్రైవేట్ భాగస్వామిని గుర్తించే బాధ్యత..ఐఐసీటీ, సీఎస్ఐఆర్ లతో ఎంవోయూ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 2 వేల ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ పార్క్ ఏర్పాటు కోసం ఏపీఐఐసీకు అనుబంధంగా ఏపీబీడీఐసీ ఏర్పాటు కానుంది.