శంఖారావం విజయవంతం చేయాలని పిలుపు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గంలో మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో సభప్రాంగణం దగ్గర రాష్ట్ర నాయుకులు కిమిడి కళావెంకటరావు టీడీపీ ఇంచార్జ్ నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ ఇంచార్జ్ నిమ్మల నిబ్రమ్ మీడియాతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లోకేష్ కార్యక్రమం నీ విజయవంతం చేసే బాధ్యత నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయుకులు, జనసైనికులు వీరమహిళలతో పాటుగా నియోజకవర్గ ప్రజలు వచ్చి జయప్రదం చేయవలిసిందిగా తెలియజేశారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శూన్యం ఐపోయింది అందుకే జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలి అని టీడీపీతో పాటుగా జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. రాబోయే ప్రభుత్వం జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-టీడీపీ మండల నాయుకులు, పట్టణ నాయుకులు, గ్రామ నాయుకులు, కార్యకర్తలు సైనికులు పాల్గొన్నారు.