క్రికెట్ టోర్నమెంటుకు ఎంపికైన రేఖకు అభినందనలు

తంబళ్లపల్లె నియోజకవర్గం: ములకలచెరువు మండలంలో కస్తూరిబా బాలికల విద్యాలయం నుండి బాలిక రేఖ అండర్ 19 క్రికెట్ టోర్నమెంటుకు ఎంపిక కావడం విషయం తెలుసుకున్న తంబళ్లపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ ఆ విద్యార్థికి అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని డిసెంబర్ 27వ తేదీ నుండి ఇండియా నేపాల్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు నేపాల్ వెళ్లడానికి ఆ విద్యార్థికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు షోరూం సూరి, జెసిపి శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శులు అంజి, మహేష్, పవర్ ఆఫ్ ద టీమ్ అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, గౌస్, ఇర్షాద్, మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.