దేవరంపాడు క్రాస్ రోడ్ వద్ద ఆటోను ఢీ కొన్న కారు

సత్తెనపల్లి: రాజుపాలెం మండలం, దేవరంపాడు క్రాస్ రోడ్ వద్ద అద్దంకి నార్కెట్పల్లి రహదారిలో నర్సరావు పేట నుండీ పిడుగురాళ్ల వైపు వెళ్తున్న కారు పిడుగురాళ్ల నుండీ దేవరం పాడు గ్రామంలోకి వెళ్తు క్రాస్ చేస్తున్న ఆటోను కారు ఢీ కొట్టటంతో ఆటో లో ఉన్న పిల్లల సరస్వతి మృతి చెందడం జరిగింధి. అలానే ఆటోలో ఉన్న మరో ముగ్గురు దేవరంపాడు గ్రామనికి చెందిన రుసుము వెంకటేశ్వర్లు మండల జనసేన పార్టీ కార్యదర్శి తల్లి రుసుము సామారాజ్యంకు అలానే ఆటో డ్రైవర్ సాంబశివ రావు, కుంభ అంజయ్యకు గాయాలు అవ్వడం జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకులు సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావుకి తెలియజేయడం జరిగింది. అందుబాటులో లేని కారణంగా నాయకులకు వెంటనే స్పందించి ప్రమాదానికి గురైన గారిని చూడమని నాయకులకు తెలియజేయడం జరిగినది. సంఘటన స్థలానికి రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్, రుద్రజడ బుల్లబ్బాయి, సిరిగిరి శ్రీ భాను, అందుబాటులో ఉన్న కొందరు జనసైనికులు కలిసి నరసరావుపేటలోని చదలవాడా అరవింద్ బాబు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగినది. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు గారు మీకు మీ కుటుంబానికి అండగా ఉంటారని మీరు ధైర్యంగా ఉండమని చెప్పమన్నారని చెప్పడం జరిగింది. త్వరలో మిమ్మల్ని పరామర్శించడానికి వస్తారని చెప్పి వారికి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది.