రైతులపై మిల్లర్లు చేస్తున్న దోపిడీని అరికట్టాలి.. తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్: రైతులు అనేక కష్టనష్టాలను పడుతూ పండించిన పంటను అమ్మడానికి వెళ్తే, తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన తెలుపుతూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ అకాల వర్షాలతో ధాన్యం మొలకెత్తి నష్టం వాటిల్లితే, మరో వైపు తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీకి గురిచేస్తున్నారు. కావున ఇలాంటి మిల్లర్లపై వెంటనే చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మరియు మండల అధ్యక్షులు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షులు కొలుగూరి అనిల్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, సోషల్ మీడియా సెక్రటరీ రెడ్డి గోపినాథ్, మోరె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.