పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చింపినవారిపై పోలీసుస్టేషన్ లో పిర్యాదు

నందిగామ, కంచికచర్ల మండలంలో జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపటంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న జనసైనికులు మరియు జనసేన నాయకులు సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది. ఇందులో భాగంగా కంచికచర్ల మండల నాయకుడు నాయిని సతీష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బ్యానర్లను చూసిన అధికార పార్టీ వాళ్లకి భయం వేస్తుందని ఆ భయంతోనే జనసేన పార్టీ బ్యానర్లను చింపుతూ వాళ్ళ భయాన్ని బయటకు చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు పూజారి రాజేష్, జనసేన పార్టీ మండల కార్యదర్శి దేవిరెడ్డి అజయ్ బాబు, మండల సంయుక్త కార్యదర్శి కుసునూరు నరసింహారావు, జనసేన మండల నాయకులు పెద్దినేడి హరిబాబు, పుప్పాల వేణుగోపాల్, కంభంపాటి తిరుమలరావు, జరిపోతులు చంటిబాబు, మరియు జనసైనికులు మణికంఠ, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.