వినాయక ఉత్సవాలలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ.పోలవరం మండలం పేర్రాజు చెరువులో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలోను, అదేవిధంగా కేశనకుర్రు గ్రామంలో వినాయక చవితి మహోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోదశి పుండరీష్, సలాది లక్ష్మణ్, గుత్తుల శ్రీను, మాదాల శ్రీధర్, పాయసం సాయి తదితరులు పాల్గొన్నారు.