ఒక జిల్లాకి డా.అంబేడ్కర్ పేరు పెట్టాలి – ఉన్నమట్ల

పాలకొల్లు నియోజకవర్గంలోని కొంతేరు అంబేడ్కర్ విగ్రహానికి జనసేన జిల్లా నాయకుడు, లవ్ పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ కీర్తి శిఖరం అయినా భారతరత్న డా.అంబేడ్కర్ కృషి ఫలితమే ఈ రిపబ్లిక్ అని రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈరోజును గత 73 సంవత్సరాలనుండి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న కానీ ఇంకా రాజ్యాంగం ఫలాలు కింది స్థాయి వరకు చేరట్లేదని ఇంకా అనేకచోట్ల కుల వివక్ష కొనసాగుతూనే ఉందని మత స్వాత్రంత్ర హక్కు ఉన్న ఇంకా మతాల కోసం గొడవలు సాగుతూనే ఉన్నాయని అంబెడ్కర్ గారు కోరుకున్న కుల రహిత సమానత్వ స్వాత్రంత్ర దేశం కోసం ఇంకా నా జాతి ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల్లో ఒక జిల్లాకు డా. బి.ఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేసారు. కొంతేరులో కూలి రైతులకోసం చేస్తున్న పోరాటం ఆపలేదని త్వరలోనే తీవ్ర రూపం దాల్చ బోతోందని సామాన్య ప్రజల పక్షాన పోరాటం చేయడానికి జనసేన ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేసారు. కోవిడ్ వైరస్ ఉదృతం అవుతున్న తరుణం అందరూ హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలని తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే బయటకు వెళ్లాలని తెలియజేసారు.