వైభవంగా రథసప్తమి వేడుకలు

చిత్తూరు, జనసేన పార్టీ పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి వైభవంగా రథసప్తమి సందర్బంగా శ్రీ సంతాన సంపద వేంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించారు. శనివారం రథసప్తమి పర్వదినం సందర్భంగా వికృతమాల గ్రామంలో శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సూర్య ప్రభ వాహనంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది. వైభవంగా రథ సప్తమి వేడుకలు.
రథసప్తమి మహోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో సూర్య ప్రభ వాహనంలో స్వామి వారు దర్శనమిచ్చారు . స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దైవనామ స్మరణలతో దేవాలయ ప్రాంగణం మారుమోగిపోయాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, శ్రీ వెంకటేశ్వర ప్రసాద్, శివ ప్రసాద్, సకుటుంబ సమేతంగా స్వామి వారికి పూజలు చేసారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.